అమరావతి : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన(Janasena) పార్టీ అభ్యర్థులకు పవన్కల్యాణ్ బీ ఫారాలను(B Forms) అందజేశారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తొలి బీ ఫాంను తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ (Nandela Manohar) కు అందజేశారు. అనంతరం పార్టీ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలుండగా టీడీపీ, జనసేన, బీజేపీలతో కుదుర్చుకున్న పొత్తుల కారణంగా 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు జనసేన పోటీ చేస్తుంది . ఈ సందర్భంగా ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన పవన్కల్యాణ్ (Pawankalyan) పండుగ రోజున బీ ఫారాలు అందజేసి అభ్యర్థులను ఉత్సహపరిచారు.