Pavan Kalyan | జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పవన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నటుడు నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇంచార్జి వర్మ పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి పవన్ భారీ ర్యాలీగా బయల్దేరారు. ఈ ర్యాలీ చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు కొనసాగింది. జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది.
పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇంఛార్జి వర్మ. pic.twitter.com/IRw4H4YMGS
— Telugu Scribe (@TeluguScribe) April 23, 2024