అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో టీడీపీ నాయకుల హత్యపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అన్నదమ్ముల హత్యల వెనుక ప్రాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఫ్యాక్షనిజం పోకడలతో ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారని వైసీపీ నేతలను నిలదీశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 30 మంది టీడీపీ కార్యకర్తలు దారుణ హత్యలకు గురయ్యారని ఆయన ఆరోపించారు. హత్యాకాండకు వైసీపీ ప్రభుత్వానిది, పోలీసులదే బాధ్యత అని అన్నారు. రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మృతుల కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.