తిరుపతి,మే2: టీడీపీ అభ్యర్ధి పనాబాక లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేసారు. మొదటి రౌండ్ ఫలితాల తర్వాత కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన్నట్టు వచ్చిన వార్తలనుఆమెఖండించారు.ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగితే ఫలితాలు వేరేగా ఉండేవని ఆమె అన్నారు. ఫలితం తెలిసి కూడా తమాషా చూద్దామనే కూర్చుని వున్నానని ఆమె చెప్పారు. జరగాల్సినవన్ని ముందే జరిగిన తర్వాత ఇప్పుడు జరిగేదేముంది అని ఆమె అన్నారు.తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపుగా అధికార వైసీపీ విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం చూస్తే వైసీపీకి రెండులక్షల 29వేల424రాగా టీడీపీకి లక్షా 33వేల 613ఓట్లు వచ్చాయి. బిజెపికి 23,223 మాత్రమేవచ్చాయి. కాంగ్రెస్ కు 3,594ఓట్లు వచ్చాయి.