అమరావతి : ఏపీలో టికెట్ల లొల్లి కొనసాగుతుంది. కూటమి పొత్తుల్లో భాగంగా ప్రకటించిన అభ్యర్థులపై పలు చోట్ల అభ్యంతరాలు వస్తుండడంతో అభ్యర్థులను మార్చి మరొకరికి అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా పి.గన్నవరం సీటును టీడీపీ జనసేన (Janasena ) కు కేటాయించింది. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ వెంటనే అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ (Giddi Satyanarayana) పేరును ప్రకటించారు. ఈయన హైదరాబాద్లో పోలీసు అధికారిగా పనిచేశారు. జనసేనలో చేరిన రెండు నెలల్లోనే ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు.
గతంలో ఈ సీటును టీడీపీ దక్కించుకోగా మొదటిలిస్టులోనే అభ్యర్థిగా సరిపెల్ల రాజేశ్ పేరును చంద్రబాబు ప్రకటించారు. ఆయన అభ్యర్థిత్వంపై టీడీపీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుండడంతో ఆ సీటును జనసేనకు కేటాయించారు. ప్రస్తుతం పొత్తులో భాగంగా జనసేనకు 21 సీట్లు కేటాయించగా పి.గన్నవరం సీటు కేటాయింపుతో ఆ సంఖ్య 22కు చేరుకుంది .