అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి దాడి చేసిన ఘటనలో శ్రీను అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. తేనే సేకరణకు శ్రీనుతో పాటు మరో ఇద్దరు యువకులు సైకిల్పై వెళ్తుండగా పొదల్లో దాక్కున్న ఎలుగుబంటి వీరిపై దాడి చేసింది . ఈ దాడిలో ఇద్దరు తప్పించుకోగా గాయపడ్డ శ్రీనును ఆళ్లగడ్డలో ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించేందుకు అతడిని నంద్యాలకు తరలించారు.