తిరుమల : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 11న ఆన్లైన్లో విడుదల చేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేస్తున్నందున భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా దర్శన టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని కోరారు.
డిసెంబర్ నెల మొత్తానికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి తరువాత తిరుమలలో పూర్తిగా నిబంధనలు ఎత్తివేయడంతో కొన్ని నెలలుగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలను సందర్శిస్తున్నారు. ఇక డిసెంబర్ నెలలో అధిక పెళ్లిళ్లు ఉన్నందను భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.