అమరావతి : ఏపీలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఏపీ సీఎం జగన్ను తాను ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం లేదని బ్రదర్ అనిల్ అన్నారు. విశాఖలో క్రైస్తవ సంఘాలతో నిర్వహించిన కీలక సమావేశంలో ఆయా సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విజయానికి కారకులైన వర్గాలకు న్యాయం జరగడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. వారి బాధలు వినేందుకు ఉత్తరాంధ్రకు వచ్చానని వెల్లడించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎంను కోరతానని తెలిపారు. ‘ సీఎం చాలా బిజీగా ఉంటున్నారు. కలిసి రెండున్నరేళ్లు అయ్యింది. సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేస్తామ’ ని వివరించారు. రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ అన్ని సంఘాల నుంచి ఉందని, పార్టీ ఏర్పాటు సాధారణమైన విషయం కాదని ఆయన తెలిపారు. విశాఖలో క్రైస్తవ సంఘాలతో నిర్వహించిన కీలక సమావేశంలో ఆయా సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
ఇటీవల విజయవాడలో కూడా బీసీ సంఘాలతో సమావేశం, సీనియర్నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.