అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్కే రాష్ట్ర ప్రజలు పట్టం కడుతారని ప్రభుత్వ సలహాదారుడు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు . తాడేపల్లిలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతుండడం వల్లే ఎన్నికల్లో పట్టం కట్టుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 12 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్లో ఈరోజు, రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్ల తీర్పు వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఉంటుందని తెలిసిపోయిందని అన్నారు. దశాబ్దాలుగా కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేతిలో మగ్గిపోయిందని, నియోజకవర్గ ప్రజలు బాబును నమ్మే పరిస్థితి లేదని, ఇక కుప్పంలోనూ వైఎస్సార్సీపీ గెలుపుఖాయమని ధీమాను వ్యక్తం చేశారు.