అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2,058 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,053 మంది చికిత్సకు కోలుకున్నారు. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 19,66,175కు పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 16,31,618 మంది కోలుకున్నారు. మరో 21,180 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,377కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 78,992 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.