తిరుమల : టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారిగా డి.నరసింహ కిశోర్ బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పదోన్నతిపై వెళ్తుతున్న గోపినాథ్ జెట్టిని కొత్త సీవీఎస్వో అభినం దించారు. అనంతరం ఆయన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సీవీ ఎస్వోకు శ్రీవారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు. అన్నమయ్య భవన్లో గోపినాథ్ జెట్టికి వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి ఆయనకు శాలువాతో సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు సీవీఎస్వోగా గోపినాథ్ సమర్ధవంతంగా సేవలందించారని అన్నారు. లడ్డులను బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా గట్టి చర్యలు తీసుకున్నారని, భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునేందుకు కృషి చేశారని కొనియాడారు.