అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు వివరించారు. ఇటీవల తనను కలిసినవారంతా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.