Allu Arjun | అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ వైడ్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2తో బన్నీ ఎలా మెస్మరైజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. ఈ సినిమాపై కావాల్సినంత నెగెటివ్ ప్రచారం చేయడానికి కూడా కొంతమంది కాచుకుని కూర్చున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్పై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి చేసిన సెటైరికల్ ట్వీట్ సంచలనంగా మారింది. కానీ బన్నీ ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడంతోనో లేదో.. టీడీపీ అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతోనో సైలెంట్గా ఆ ట్వీట్ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే నెటిజన్లు ఆ ట్వీట్ను స్క్రీన్షాట్ తీసుకోవడంతో సోషల్మీడియాలో అది వైరల్గా మారింది.
” అల్లు అర్జున్ గారూ.. నంద్యాలలో మీరు చేసిన ఎన్నికల ప్రచారాన్ని మా ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. నంద్యాలలో మీరు ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించిన విధంగానే.. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే నిర్వహించాలని ఆశిస్తున్నాం. నంద్యాలో పర్యటించాలన్న మీ సెంటిమెంట్ మాకు బాగా వర్కవుట్ అయ్యింది.. మీ సెంటిమెంటే ఇప్పుడు మా సెంటిమెంట్ అల్లు అర్జున్ గారూ.. మీ పుష్ప 2 చిత్రం పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.” అంటూ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ట్వీట్ చేశారు. దీనిపై అల్లు ఫ్యాన్స్ నుంచి విమర్శలు భారీగానే వచ్చాయి. ఈ క్రమంలోనే శబరి తన ట్వీట్ను డిలీట్ చేశారు.
Byreddy Shabari tweet
ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మిత్రుడు, వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి కోసం నంద్యాలకు వెళ్లారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసింది. అయినప్పటికీ పవన్ కల్యాణ్ను కాదని.. నంద్యాలలో శిల్పా రవికి మద్దతుగా వైసీపీ తరఫున ప్రచారం చేయడం అప్పట్లో సంచలనం రేపింది. దీంతో టీడీపీ వాళ్లే కాకుండా మెగా ఫ్యాన్స్ కూడా కొందరు అల్లు అర్జున్పై పగబట్టారని సమాచారం. ఈ క్రమంలోనే బన్నీ సినిమాకు కావాల్సినంత దుష్ప్రచారం చేసేందుకు సిద్ధమైనట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ ఎంపీ సైతం పుష్ప 2 సినిమాకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి డిలీట్ చేయడం వైరల్గా మారింది.