అమరావతి : ఏపీలో అధికార వైసీపీ పార్టీ (YSRCP) అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పేర్లను ప్రకటించి అందరికంటే ముందువరుసలో నిలిచింది. అనకాపల్లి(Anakapalli) ఎంపీ స్థానాన్ని నిలిపివేసిన వైసీపీ అధ్యక్షుడు , సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఆ స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న బూడి ముత్యాలనాయుడి (Mutyalanayudu) అనకాపల్లి బరిలో నిలుపుతున్నట్లు వెల్లడించారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల(Madugula) సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాడుగుల స్థానానికి ముత్యాల నాయుడు కూతురు ఈర్లి అనురాధను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఎంపిక చేశారు.