అమరావతి : ఏపీలోని ప్రతిపక్ష నాయకులపై సీఎం వైఎస్ జగన్ (AP CM Jagan) మరోసారి తీవ్ర విమర్షలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమవరంలో నిర్వహించిన మేమంతా సిద్ధం కార్యక్రమంలో మాట్లాడారు. కొంగ జపం చేస్తున్నావని చంద్రబాబు ( Chandra Babu) ను, పెళ్లిళ్ల వ్యవహారాన్ని పవన్కల్యాణ్ (Pawan Kalyan) ను ప్రశ్నించినందుకు తనపై కోపాన్ని పెంచుకున్నారని ఆరోపించారు. రాళ్లు వేయండి.. అంతం చేయండని పిలుపునిస్తున్నారని ఆరోపించారు.
రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతో వచ్చినేవనని దుయ్యబట్టారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ , రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తుందని ఆరోపించారు. పేదలకు మంచి చేయడం వల్ల ఓర్వలేక అన్ని పార్టీలు కలిసి ఒక్క జగన్ మీద దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఐదేండ్లలో లంచాలు, వివక్ష లేకుండా 2.72 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చుచేశామని తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశామని వివరించారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినా చంద్రబాబు పేదలకు మంచి చేసే పథకం ఏది అమలు చేయలేదని, సాధ్యం కాని హామీలు ఇస్తున్న వారిపై ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.