అమరావతి : వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేలా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అహర్నిశలు కష్టపడాలని ఏపీ సీఎం జగన్ పేర్నొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ‘ గడపగడపకు మన ప్రభుత్వం’పై నిర్వహించిన వర్క్షాప్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
గడప గడపకు కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో గతంలో 151 సీట్లు వచ్చాయని రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు సాధించడం లక్ష్యంగా పని చేయాలని, ఇది కష్టమైన పని కాదని అన్నారు. నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడప గడప కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి సచివాలయంలో రెండురోజుల పాటు గడపాలని ఆదేశించారు.
కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని, రాష్ట్రంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్స్వీప్ చేస్తామనుకున్నామని అనుకున్నామా? అని అన్నారు. గడప గడపకు కార్యక్రమాన్ని ఇంకా మెరుగ్గా నిర్వహించేందుకు ప్రతినెల ఒకసారి వర్క్షాప్ను నిర్వహిస్తామని వెల్లడించారు.