అమరావతి : కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padbanabham) జనసేన అధినేత(Janasena Leader ) పవన్కల్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనలో చేరుతున్నట్లు గతంలో ప్రకటించిన ముద్రగడ నెలరోజులుగా స్థబ్దుగా ఉన్నారు. స్వయాన పవన్కల్యాణ్(Pawan Kalyan) ముద్రగడ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన (Janasena) ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కాపు ఐకాస నాయకులు జనవరి 13న ముద్రగడ నివాసానికి వెళ్లి రెండు గంటలకు పైగా భేటీ అయ్యారు.
ఇప్పటివరకు పవన్ కల్యాణ్ ముద్రగడతో భేటి జరుగకపోవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు పవన్కల్యాణ్ టీడీపీ, బీజేపీలతో పొత్తుల వ్యవహారంలో బిజీగా ఉండడం, ఆయా జిల్లాలో పర్యటనలు ఉండడం వల్ల సీనియర్ నేత ముద్రగడను కలవలేకపోయారు.
ఇదే అంశంపై మంగళవారం నాడు తనను కలిసిన మీడియాతో ముద్రగడ మాట్లాడారు. ‘ తనను కలవడానికి వస్తే నమస్కారం.. లేకపోతే రెండు నమస్కారాలు అంటూ వ్యాఖ్యనించారు. మనం చెప్పాల్సింది చెప్పాం.. ఇక వారిష్టమని ’ పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముద్రగడ లాంటి నాయకుడిని విస్మరిస్తుండడం వల్ల ఆయన అనుచరవర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు .