అమరావతి: రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. పాపం చేసినప్పుడు తప్పక అనుభవించాల్సిందేనన్నారు. కర్మ సిద్ధాంతం ప్రకారం పుణ్యం చేస్తే పుణ్య ఫలం, పాపం చేస్తే పాప ఫలాలు అనుభవించాల్సిందేనని చెప్పారు. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపైనే విచారణ జరుగుతున్నదన్నారు.
ఈడీ విచారణకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఈడీ విచారణకు రాజకీయాలను ఆపాదించడం తగదని విజయసాయిరెడ్డి అన్నారు. విపక్షాల విమర్శలను వైసీపీ ఖండిస్తుందని చెప్పారు. ఈడీని స్వచ్ఛందంగా తమ పని చేసుకునేలా సహకరించాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు. కాంగ్రెస్ నేతలపై కేంద్రం ఎలాంటి కక్ష సాధింపులకు దిగడం లేదన్నారు. మనీలాండరింగ్ జరిగిందంటున్నారని, దానిపై విచారించడంలో తప్పేమీ లేదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల మేరకు విచారణ జరుగుతుందన్నారు.