అమరావతి: మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని ఎవరు హత్యచేశారనే విషయం త్వరలోనే తెలుస్తుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తనను ఎవరూ బెదిరించలేరని, బెదిరించేవాళ్లే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లోక్సభలో తనను ఉద్దేశించి వైసీపీ ఎంపీలు అసభ్యకరంగా మాట్లాడారని, చట్టసభల్లో అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించడం మంచిదికాదని హితవుపలికారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే ఎంపీలు మాట్లాడుతున్నట్లుగా ఉందని చెప్పారు. అలాంటి ఆలోచనా విధానం నుంచి సీఎం జగన్ బయటకు రావాలని సూచించారు.