విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి (TDP) ఎంపీ కేశినేని నాని మరో షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ నిరాకరించడంతో విజయవాడ ఎంపీ నాని (MP Kesineni Nani) ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కూతురు కేశినేని శ్వేత కూడా టీడీపీకి గుడ్బై చెప్పనున్నారు. తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈమేరకు నాటి ట్వీట్ చేశారు.
విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న శ్వేత.. సోమవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తన రాజీనామా లేఖను అందజేయనున్నారు. కార్పొరేటర్ పదవితోపాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు నాని స్పష్టం చేశారు.
అందరికీ నమస్కారం 🙏🏼
ఈ రోజు శ్వేతా 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫిసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది . pic.twitter.com/gANCVCKrZJ— Kesineni Nani (@kesineni_nani) January 7, 2024