తిరుమల : తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో శనివారం నుంచి సుప్రభాత సేవలు పునః ప్రారంభమయ్యాయి . ధనుర్మాసం కారణంగా గత నెల 17 నుంచి సుప్రభాతంకు బదులుగా తిరుప్పావై సేవను నిర్వహించిన అర్చకులు నేటి నుంచి సుప్రభాత సేవను ఏకాంతంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 16 నుంచి ప్రారంభమైన పవిత్రమైన ధనుర్మాసం శుక్రవారం ముగియడంతో సుప్రభాత సేవ పునఃప్రారంభించారు.
ఈనెల 22 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతున్న దృష్ట్యా అప్పటి వరకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.