అమరావతి : ఏపీలో కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 17,354 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 8468 మంది కోలుకున్నారు. 64 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 11,01,690కి పెరిగాయి. 9,70,718 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 1,22,980 చేరాయి. ఇవాళ్టి వరకు 7992 మంది మృతి చెందారు.
24 గంటల వ్యధవధిలో 86,494 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.