అమరావతి : అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం తంతడి బీచ్లో ఫొటోషూట్ చేస్తున్న ఫొటోగ్రాఫర్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. హైదరాబాద్కు చెందిన ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ కొత్త జంటకు ఫొటోషూట్ కవరేజ్ కోసం అనకాపల్లి జిల్లాకు వెళ్లాడు . ఫొటోషూట్ కోసం నీటి ప్రవాహాన్ని గమనించకుండా నీటిలో దిగాడు.
దీంతో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు.