అమరావతి : విజయవాడలో ఏపీ మంత్రి జోగిరమేశ్ అనుచరులు రెచ్చిపోయారు. భవానినగర్లోని పున్నమి హోటల్లో మంత్రి అనుచరులకు టూరిజం శాఖ ఉద్యోగులు ఫొటోషూట్కు అనుమతిని నిరాకరించారు. దీంతో వాగ్వాదం మొదలైంది. ఈ దశలో మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ అధికారులపై అనుచరులు దాడులకు దిగారు.
దీంతో తీవ్రమనస్థాపానికి గురైన అధికారులు, ఉద్యోగులు భవనిపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు మంత్రి అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.