(Sidiri Appalaraju) విశాఖ: రింగు వలల విషయంలో మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటైంది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని మత్స్యకారులకు మంత్రులు సూచించారు. కలెక్టరేట్లో ఆర్డీవో పెంచల కిషోర్ అధ్యక్షతన మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించినా సయోధ్య కుదరలేదు. దాంతో ఇవాళ రెండు గ్రామల మత్స్యకారులతో మంత్రులు సీదిరి అప్పలరాజు, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్రావులు సమావేశమై చర్చించారు. ఈ సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు విశాఖ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా కూడా హాజరయ్యారు.
సమావేశం అనంతరం పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులతో కమిటీ వేసినట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. మత్స్యకార గ్రామాల్లో రేపటి నుంచి 144, 145 సెక్షన్లు తొలగిస్తున్నామని, రేపటి నుంచి నిబంధనల ప్రకారం మత్స్యకారులు చేపల వేట కొనసాగించవచ్చని ప్రకటించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రింగు వలల వాడకం విషయంలో రెండు మత్స్యకార వర్గాల మద్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. రెండు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా బోట్లకు నిప్పుపెట్టే వరకు వెళ్లారు. వీరిని శాంతపరిచేందుకు పోలీసు బలగాలు, ప్రత్యేక సర్వీసులు, సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..