అమరావతి : ఏపీ మంత్రి రోజా (Minister Roja) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై సెటైర్లు వేశారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా బహిరంగ సభలో పవన్ ఆవేశంతో మాట్లాడిన తీరుపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్(YS Jagan) ను పాతాళానికి తొక్కి వేస్తానని మాట్లాడిన తీరును చూస్తుంటే తీవ్ర ఫ్రస్టేషన్లో ఉన్నట్లు అర్థమవుతుందని అన్నారు.
‘ చంద్రబాబుతో పొత్తు్(Allaince) పెట్టుకున్నప్పుడే నువ్వు పాతాళానికి దిగజారిపోయావని, ఊగిపోయి మాట్లాడితే ఓట్లురావు. అదే జరిగితే ఆర్ నారాయణమూర్తి ప్రధాన మంత్రి అయ్యేవాడని ’ సెటైర్లు (Satires) వేశారు. 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ స్థానాలున్న ఏపీలో ముష్టి 30 సీట్లుకూడా పొత్తుల్లో దక్కించుకోని పవన్ వైఎస్ జగన్ గురించి మాట్లాడడమా అంటూ విమర్శించారు.
తనను ప్రశ్నించవద్దంటూ పవన్ వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ అనైతిక పొత్తులపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఎందుకు ప్రశ్నించవద్దని అన్నారు. పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడని ఆరోపించారు.