అమరావతి : ఏపీలో నిర్వహించిన డీఎస్సీ 2025లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీలో అడ్డంగా టీచర్ పోస్టులు ( Teacher Posts ) అమ్ముకున్నారని ఆరోపించారు.
అడ్డదారుల్లో కొందరికి ఎలా ఉద్యోగాలు వచ్చాయో బయటపడుతున్నాయని పేర్కొన్నారు. వీటిని డిఫెండ్ చేసుకోవడానికి ఇద్దరు మహిళా అధికారులను ఎంపిక చేసుకుని పాత విషయాలనే వెల్లడిస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ కుంభకోణం చిన్న విషయం కాదు. చేసిన వ్యక్తులు చిన్న వాళ్లు కాదు అని స్పష్టం చేశారు. ఈ అంశంపై వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ స్కాంకు మూల సూత్రదారి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. అక్రమాలపై ప్రతిపక్షాలు నిలదీస్తే బుకాయింపు,, బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. డీఎస్సీలో సెలక్ట అయిన వాళ్లంతా అడ్డదారుల్లో వచ్చిన వాళ్లు కాదని, ఉద్యోగం రాని వారికి అంతా అండగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవనే భరోసా కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.