ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ భేటీ అయ్యారు. టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీలో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొత్స సత్యానారాయణ ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. నారాయణ అరెస్ట్ విషయాలను సీఎం జగన్కు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని నారాయణ నివాసానికి మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు.