అమరావతి : వ్యాపారి నిర్లక్ష్యం వల్ల విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన విజయవాడ ఎనికెపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లయోలా కళాశాలలో డిగ్రీ చదువుతున్న చైతన్య అనే విద్యార్థి దాహంతో ఒక దుకాణానికి వెళ్లి వాటర్ బాటిల్ అడగగా గమనించకుండా యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. అయితే తీవ్రదాహంతో ఉన్న విద్యార్థి చైతన్య బాటిల్లోని యాసిడ్ తాగాడు.
దీంతో తీవ్ర అస్వస్థత గురైన విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం కళాశాల యాజమన్యం విరాళాలు సేకరిస్తుండడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.