అమరావతి : ఏపీలోని ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో పోలీసులు మావోయిస్టుల డంప్ను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు కోసంపుట్ గ్రామ అటవీప్రాంతంలో నిల్వ ఉంచిన డంప్ను పట్టుకున్నారు. 303 రైఫిల్స్, రెండు ఎల్ఈడీలు, గ్యాస్గన్, నాలుగు తుపాకీలు, 22 రకాల ఆయుధాలు, బ్యానర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.