విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా నర్సీపట్నంలో గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. మహారాష్ట్రకు సంబంధించిన స్మగ్లర్లు కారులో గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో నర్సీపట్నంలో ట్రాఫిక్ ఎస్ఐ కారులో గంజాయిని గుర్తించారు. దీంతో ఎస్ఐ ఆ కారును వెంబడించారు. కారు వేగం పెంచి పారిపోయే యత్నం చేశారు.
ఈ క్రమంలో పలు వాహనాలను ఢీకొట్టారు. అయితే పోలీసులు సమీపిస్తుండటంతో కారును వదిలేసిన స్మగ్లర్లు రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూకారు. దీంతో చెరువు చుట్టూ మోహరించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉన్నది.