అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. జిల్లాలోని కష్టగిరి మండలం మల్యాలలో రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఆలంకొండకు చెందిన ప్రసాద్, అనిత గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు ప్రసాద్కు అక్క కూతురితో 45 రోజుల క్రితం వివాహం జరిపించారు.
తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని ప్రసాద్ నిన్న రాత్రి ప్రియురాలితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.