అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది.
కర్ఫ్యూ నేపథ్యంలో ఇప్పటికే ప్రజారవాణాపై సైతం ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను నడుపనున్నట్లు స్పష్టం చేసింది.
నిత్యావసరాల దుకాణాలకు సైతం ఇదే సమయం వర్తిస్తుందని తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ప్రైవేట్ వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది. సిటీ బస్సులకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఆర్టీసీ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.