అమరావతి : ఆంధ్రప్రదేశ్లో బినామీ పేర్లపై లిక్కర్ బిజినెస్ నడుస్తుందని జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆరోపించారు. ఇవాళ భీమవరంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మద్యపాన నిషేధం అని చెప్పి జగన్ మాట తప్పారని విమర్శించారు. లిక్కర్పై భారీగా ధరలుపెంచడంతో మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ. 30 వేల కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు.
నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలలో 55వేల కోట్లు ఖర్చు చేశామని వైఎస్ జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, వరల్ట్ ఆర్గనైజేషన్ వెల్లడించిన జాబితాలో విద్యలో ఏపీ ముందు వరుసలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిపై దాడులు చేయిస్తున్నారని పవన్ ఆరోపించారు.
ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయకపోతే అందరిని రోడ్డున పడేస్తారని తెలిపారు. రాష్ట్రంలో బాగా పనిచేస్తే తామే ప్రేమతో గౌరవిస్తామని అన్నారు.