తిరుమల : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ విప్ భాస్కర్రెడ్డి , తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, తమిళనాడు, గుజరాత్ మంత్రులు గాంధీ, జితేంద్ర చౌదరి, సినీ నటి కంగనా రనౌత్, హీరో సాయికుమార్, దర్శకుడు అనిల్ రావిపుడి తదితరులు వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
కొవిడ్ కారణంగా టీటీడీ పరిమిత సంఖ్యలో తిరుమలకు అనుమతిస్తున్నప్పటికీ నూతన సంవత్సరం రోజు స్థానిక, స్థానికేతర భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.