అమరావతి : ఏపీలోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై ఏపీ హైకోర్టు న్యాయవాది సీబీఐకి ఫిర్యాదు చేశారు. లక్ష్మీనారాయణ అనే న్యాయవాది ఎంపీపై ఫిర్యాదును ఈ -మెయిల్ ద్వారా చెన్నై కార్యాల యానికి పంపించారు. ఫిర్యాదు పత్రంతో పాటు మాధవ్కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ను జత చేసి పంపించారు. వీడియోకాల్ లో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించిన తీరు జుగుప్సగా ఉందని పేర్కొన్నారు.
వీడియో కాల్ ను ఒక సామాజిక వర్గం వారు చేసి తనను అప్రదిష్టపాలు చేస్తున్నారని ఎంపీ చేసిన వ్యాఖ్యలతో రెండువర్గాల మధ్య విధ్వేషాలు చెలరేగే అవకాశముందని ఆయన తెలిపారు. ఎంపీ మాధవ్పై సీబీఐ సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.