అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల్లో పర్యవేక్షణ కొరవడ్డాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖపట్నంలో వరస ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. పారిశ్రామిక ప్రమాదాలు, కార్మికుల మరణాలు సాధారణమ య్యాయని అన్నారు. ప్రమాదాలపై కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని అన్నారు.
ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందజేయాలని కోరారు.