తిరుమల: తిరుపతి కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రం సందర్భంగా కృత్తికా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపై దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ తరువాత జ్వోలాతోరణం వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ భూపతి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.