అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడ్డ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరుపెట్టాలని ఇవాళ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇచ్చిన బంద్ పిలుపు కొనసాగుతుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రాజోల్ ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు టీడీపీ, సీపీఐ ఎస్సీ సంఘాలు , అంబేద్కర్వాదులు మద్దతును ప్రకటించారు.
ఆందోళన చేస్తున్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, సీపీఐ నాయకులను సుమారు 50 మందిని అరెస్టు చేసి రోజోలు పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆందోళనకారులు స్టేషన్ ఎదుట నినాదాలు చేసి ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టడడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. అనంతరం కోనసీమ ముఖ ద్వారం వద్ద నిరసన నిర్వహించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.