అమరావతి : ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ (Media Academy) చైర్మన్గా కొనసాగుతున్న కొమ్మినేని శ్రీనివాసరావు(Kommineni Srinivas Rao) తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాజీనామా పత్రాన్ని వైఎస్ జగన్ కు పంపినట్లు పేర్కొన్నారు.
2022 నవంబర్ 10న మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కొమ్మినేని 13 నెలల పాటు పనిచేశారు. తనకు చైర్మన్గా అవకాశమిచ్చినందుకు వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత జర్నలిస్టుల కోసం జర్నలిజం లో డిప్లమో కోర్సును నాగార్జున యూనివర్సిటీ సహకారంతో ప్రారంభించడం తనకు సంతృప్తినిచ్చిన విషయమని అన్నారు.