తిరుపతి : ఈనెల 16న రథసప్తమి(Rathasaptami) సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని (Koil Alwar Thirumanjanam) ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
తిరుమంజనం సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం (Kalyanotsavam), ఊంజల్సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాదుకు చెందిన భక్తురాలు స్వర్ణకుమారి అందించిన పరదాల సెట్ను ఆలయంలో అలంకరించారు. ఈ కార్యక్రమంలో విజివో బాలిరెడ్డి, ఆలయ ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, ఎవిఎస్వో శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.