అమరావతి: మాజీమంత్రి, టీడీపీ నాయకుడు గారపాటి సాంబశివరావు మృతి బాధాకరం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నాయకుడిగా పార్టీకి, ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీమని, సాంబశివరావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని పేర్కొన్నారు.
ఆయన పనితీరు, ప్రజా సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్దికి నిదర్శనంగానే దెందులూరు ప్రజలు 4 సార్లు ఎమ్మెల్యేలుగా ఆదరించారని చెప్పారు. సాంబశివరావు లాంటి నేతను కోల్పోవటం టీడీపీకి తీరని లోటని, ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబసభ్యులకు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రగాడ సానుభూతి తెలిపారు.