Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కంచి కామకోటి ఫీఠాధిపతులు శ్రీశ్రీశ్రీవిజయేంద్ర సరస్వతి మహాస్వామి దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆలయం రాజగోపురం వద్దకు చేరుకున్న పీఠాదిపతి వారికి ఏపీ దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, ట్రస్ట్బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, వేదపండితులు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారి గర్బాలయంలో పంచామృత అభిషేకములు, బిల్వార్చన చేసుకుని అమ్మవారి ఆలయంలో హారతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలమండలి సభ్యులు మఠం విరూపాక్షయ్య, విజయలక్ష్మి, రామేశ్వరి, లక్ష్మిసావిత్రమ్మ, మధుసూధన్రెడ్డి, తన్నీరు ధర్మరాజులు పాల్గొన్నారు. శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చిన్న సిద్దరామ శివాచార్య మహా స్వామి కూడా భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.