తిరుపతి : టీటీడీ (TTD) ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ జిల్లా దేవుని కడప (Kadapa) లో ఉన్న లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 10 నుంచి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahamotsavam) వైభవంగా నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని వివరించారు.
ఫిబ్రవరి 15న ఉదయం 10 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం (Kalyanotsavam) జరుగనుందని తెలిపారు. రూ.300 చెల్లించి గృహస్తులు (ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చని, ఫిబ్రవరి 19 తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలను ప్రకటించారు.