తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ కొనసాగుతుంది . శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి 10 గంటల్లో దర్శనం కలుగు తుందని టీటీడీ వర్గాలు తెలిపాయి. నిన్న స్వామివారిని 79,833 మంది భక్తులు దర్శించుకోగా 36,074 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.
ఇవాళ తెల్లవారుజామున ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ, జస్టిస్ కృపాసాగర్, తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్ భీమపాక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు , తీర్థప్రసాదాలు అందించారు.