అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ (CJ Lisa Gill ) నియమితులయ్యారు. శనివారం సాయంత్రం లోక్భవన్లో ఆమె సీజేగా ప్రమాణం చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ( CM Chandra Babu ) సీజేను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు సీజేగా బాధ్యతలు నిర్వహించిన ధీరజ్ సింగ్ ఠాకుర్ పదవి విరమణ చేయడంతో అతడి స్థానంలో చండిగఢ్ రాష్ట్రానికి చెందిన లిసా గిల్ను కేంద్రం ఏపీ సీజేగా నియమించింది.