అమరావతి: హెలికాప్టర్ ప్రమాదంలో అమరత్వం పొందిన చిత్తూరు జిల్లా వాసి జవాన్ లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు శుక్రవారం లేఖ రాశారు. అనతికాలంలోనే సాయితేజ పట్టుదల, కృషితో త్రివిధ దళాధిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరి దేశానికి సేవలందించడం అభినందనీయమని అన్నారు. నేటి యువతకు ఆయన ఆదర్శమని కొనియాడారు.
సాయితేజ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని , ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలువాలని ఆయన లేఖలో పేర్కొన్నారు