అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి జవహర్రెడ్డి విధుల్లో చేరారు. జవహర్రెడ్డి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓగా కూడా విధులు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత వారం ఎనిమిది మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో భాగంగా జవహర్రెడ్డిని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. టీటీడీ ఈఓ పదవిలో కూడా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గా కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. పీఎస్ఆర్ ఆంజనేయులును ఇంటెలిజెన్స్ కొత్త డీజీపీగా నియమితులయ్యారు.
మరోవైపు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఏప్రిల్ 2న కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మరోసారి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలను స్వీకరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిశీలన పూర్తయ్యాక కొత్త జిల్లాలకు అధికారుల విభజన జరుగనున్నది.