అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ రేపు పదవీ విరమణ చేయనున్నందున డిసెంబర్ 1న జవహర్రెడ్డి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
గతేడాది ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత డాక్టర్ సమీర్శర్మకు రెండు సార్లు పొడిగింపులు లభించాయి. జవహర్ రెడ్డి వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత జూన్, 2024లో పదవీ విరమణ చేయనున్నారు. గతంలో జవహర్ రెడ్డి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు.
కాగా రేపు పదవి విరమణ చేస్తున్న సమీర్శర్మను ప్రభుత్వ ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం ప్రభుత్వం కొత్తగా పోస్టును సృష్టించింది. ప్రణాళికా విభాగం ఎక్స్ అఫీసియో కార్యదర్శిగా ఉన్న విజయ్కుమార్ రేపే రిటైర్మెంట్ అవుతుండడంతో ఆయనను స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా నియమించింది.