అమరావతి : అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టన మహాపాదయాత్రకు జనసేన మద్దతు ఉంటుందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసపల్లి వరకు 900 కిలోమీటర్ల వరకు కొనసాగే పాదయాత్రకు గ్రామాల్లోని జనసేన కార్యకర్తలు పూర్తిగా సహకరించాలని సూచించారు. వైఎస్ జగన్ ఏపీ సీఎం అయ్యాక ప్రజలతో మాట్లాడే తీరిక లేకుండా పోయిందని విమర్శించా రు. ఒక్క రాజధానినే కట్టని వారు మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు.
అమరావతే ఏపీకి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న వైఎస్ జగన్కు ప్రజలే తగిన బుద్ధిజెబుతారని పేర్కొన్నారు. వేలాధి కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం జరుగుతుంటే మూడు రాజధానులంటూ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను అయోమ యానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రాజధానిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా దానిని ఖాతరు చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజధానిపై మంత్రులు రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తుండడం విచారకరమని తెలిపారు.